రోహిత్ అవుట్ | rohit out | Sakshi
Sakshi News home page

రోహిత్ అవుట్

Jan 20 2016 1:43 PM | Updated on Sep 3 2017 3:59 PM

ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో 349 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి వికెట్ కోల్పోయింది.

కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో 349 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 65 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (41) అవుటయ్యాడు. రిచర్డ్సన్ బౌలింగ్లో రోహిత్.. కీపర్ వేడ్కు దొరికిపోయాడు. టీమిండియా 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. ధవన్, కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కంగారూలు నిర్ణీత ఓవర్లలో  8 వికెట్లకు 348 పరుగులు చేశారు. ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ (107) సెంచరీ చేయగా, మరో ఓపెనర్  డేవిడ్ వార్నర్ (93) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కెప్టెన్ స్మిత్ (29 బంతుల్లో 51) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో మ్యాక్స్ వెల్ విజృంభించి 20 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో 41 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లు ఇషాంత్ 4, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement