అర్జున్‌కు శాట్స్‌ చైర్మన్‌ అభినందన | SATS Chairman admires Chess Player Arjun | Sakshi
Sakshi News home page

అర్జున్‌కు శాట్స్‌ చైర్మన్‌ అభినందన

May 24 2018 11:20 AM | Updated on May 24 2018 11:20 AM

SATS Chairman admires Chess Player Arjun - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోల్‌కతా ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో రాణించిన తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్‌ను బుధవారం శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో మరెన్నో గొప్ప విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. కోల్‌కతాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 9 పాయింట్లకుగానూ 7 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచాడు.

ఇందులో భాగంగా తనకన్నా ఎంతో మెరుగైన ఆటగాళ్లపై విజయాలు సాధించి తొలి జీఎం నార్మ్‌ను సాధించాడు. ఈ సందర్భంగా శాట్స్‌ చైర్మన్‌ను కలిసిన అర్జున్‌... మెరుగైన టోర్నీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం తరఫు నుంచి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. అతని వినతిపై శాట్స్‌ చైర్మన్‌ సానుకూలంగా స్పందించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement