అర్జున్‌కు శాట్స్‌ చైర్మన్‌ అభినందన

SATS Chairman admires Chess Player Arjun - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోల్‌కతా ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో రాణించిన తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్‌ను బుధవారం శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో మరెన్నో గొప్ప విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. కోల్‌కతాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 9 పాయింట్లకుగానూ 7 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచాడు.

ఇందులో భాగంగా తనకన్నా ఎంతో మెరుగైన ఆటగాళ్లపై విజయాలు సాధించి తొలి జీఎం నార్మ్‌ను సాధించాడు. ఈ సందర్భంగా శాట్స్‌ చైర్మన్‌ను కలిసిన అర్జున్‌... మెరుగైన టోర్నీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం తరఫు నుంచి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. అతని వినతిపై శాట్స్‌ చైర్మన్‌ సానుకూలంగా స్పందించారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top