సాయి రిషిరాజ్ గెలుపు | sai rishi raj wins under 7 chess championship | Sakshi
Sakshi News home page

సాయి రిషిరాజ్ గెలుపు

Sep 22 2016 11:16 AM | Updated on Sep 4 2017 2:32 PM

జాతీయ అండర్-7 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాళ్లు సాయి రిషిరాజ్, ఆదిరెడ్డి అర్జున్ నాలుగో రౌండ్ గేముల్లో విజయం సాధించారు.

హైదరాబాద్: జాతీయ అండర్-7 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాళ్లు సాయి రిషిరాజ్, ఆదిరెడ్డి అర్జున్ నాలుగో రౌండ్ గేముల్లో విజయం సాధించారు. పుదుచ్చేరిలో బుధవారం జరిగిన బాలుర కేటగిరీ నాలుగో రౌండ్లో రిషిరాజ్ (3)... ఫహీమ్ బొరా (అస్సాం; 2)పై, ఆదిరెడ్డి అర్జున్ (3)... హస్నన్ సిద్దిఖి (ఉత్తర ప్రదేశ్; 2)పై గెలుపొందారు. మిగతా పోటీల్లో గణేష్ సారుు సిద్ధార్థ్ (2.5)... శ్రీహరి (తమిళనాడు; 3.5) చేతిలో ఓడగా, అభిరాజ్ అరోరా (2.5)... శక్తివేల్ కన్నా (తమిళనాడు; 2.5)తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఆర్ణవ్ (2)... మాధవాన్‌‌ష (గుజరాత్; 1)పై విజయం సాధించగా... లక్ష్య్ జైన్ (2)... ప్రియాన్‌‌ష దాస్ (ఒడిశా; 3)చేతిలో ఓడిపోయాడు.

 

నాలుగు రౌండ్లు ముగిసే సరికి తమిళనాడు ఆటగాడు ఐలంపతి (4) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నాలుగో రౌండ్లో అతను రుత్విక్ శ్రీకాంత్ (కర్ణాటక; 3)పై నెగ్గాడు. బాలికల కేటగిరీలో జరిగిన నాలుగో రౌండ్ పోటీల్లో తెలంగాణ అమ్మారుులు అనికా రెడ్డి (2)... కృష్ణశ్రీ (పుదుచ్చేరి; 0)పై, అభిజ్ఞ (2)... శివిక (రాజస్తాన్; 1)పై గెలుపొందారు. రిమితా రెడ్డి (3)కి సంజన నాగరాజన్ (తమిళనాడు; 4) చేతిలో పరాజయం ఎదురైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement