
జాతీయ చాంపియన్ విష్ణు
న్యూఢిల్లీ: తెలుగుతేజం విష్ణువర్ధన్ జాతీయ టెన్నిస్ చాంపియన్గా అవతరించాడు. శనివారం జరిగిన ఫైనల్లో విష్ణు 6-2, 4-6, 6-3 తేడాతో సిద్ధార్థ్ రావత్పై విజయం సాధించాడు.
న్యూఢిల్లీ: తెలుగుతేజం విష్ణువర్ధన్ జాతీయ టెన్నిస్ చాంపియన్గా అవతరించాడు. శనివారం జరిగిన ఫైనల్లో విష్ణు 6-2, 4-6, 6-3 తేడాతో సిద్ధార్థ్ రావత్పై విజయం సాధించాడు. తొలి సెట్లో విష్ణు సునాయాసంగా గెలిచినా... రెండో సెట్లో సిద్ధార్థ్ పుంజుకున్నాడు. కానీ చివరి సెట్లో విష్ణు ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడి మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. 2011లో చివరిసారి ఈ టోర్నీలో ఆడిన విష్ణు... అప్పుడు ఫైనల్లో యూకీ బాంబ్రీ చేతిలో ఓడాడు. మహిళల విభాగంలో ప్రేరణ బాంబ్రి 4-6, 6-4, 6-3 తేడాతో కర్మాన్ కౌర్ను ఓడించి జాతీయ చాంపియన్గా నిలిచింది.