రాజస్తాన్‌ లక్ష్యం 162

Mumbai Indians Set Target of 162 Runs Against Rajasthan - Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 162 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ను డీకాక్‌-రోహిత్‌ శర్మలు ఆరంభించారు. కాగా, రోహిత్‌ శర్మ(5) నిరాశపరచడంతో ముంబై ఇండియన్స్‌ 11 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆపై డీకాక్‌తో జత కలిసిన సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే డీకాక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ముంబై స్కోరు 108 పరుగుల వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌(34) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

అటు తర్వాత డీకాక్‌-హార్దిక్‌ పాండ్యాల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. డీకాక్‌(65;47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక‍్సర్లు) మూడో వికెట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడు. ఇక పొలార్డ్‌(10), హార్దిక్‌ పాండ్యా(23)లు స్కోరు పెంచే క్రమంలో ఔటయ్యారు. చివర్లో బెన్‌ కట్టింగ్‌ 9 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌ సాయంతో​ 13 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.  రాజస్తాన్‌ బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌ రెండు వికెట్లు సాధించగా, స్టువర్ట్‌ బిన్నీ, ఆర్చర్‌, ఉనాద్కత్‌లు తలో వికెట్‌ తీశారు.

Liveblog - రాజస్తాన్‌ లక్ష్యం 162

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top