
అఫ్ఘానిస్తాన్పై భారత్ ‘ఎ’ విజయం
ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ ‘ఎ’ ఖాతాలో తొలి విజయం చేరింది.
ప్రిటోరియా (దక్షిణాఫ్రికా): ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ ‘ఎ’ ఖాతాలో తొలి విజయం చేరింది. దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన తొలి మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో ఓడిన భారత్ ‘ఎ’... శుక్రవారం అఫ్ఘానిస్తాన్తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన భారత ‘ఎ’ కెప్టెన్ మనీశ్ పాండే అప్ఘానిస్తాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అక్షర్ పటేల్ (3/33), విజయ్ శంకర్ (3/24), యజువేంద్ర చహల్ (2/42) ధాటికి తొలుత బ్యాటింగ్కు దిగిన అప్ఘానిస్తాన్ ‘ఎ’ 40.5 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది.
అష్రఫ్ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రహమత్ షా (35; 3 ఫోర్లు) రాణించారు. అనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని భారత్ ‘ఎ’ 30.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కరుణ్ నాయర్ (83 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. మనీశ్ పాండే (52 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు), రిషభ్ పంత్ (10 బంతుల్లో 17 నాటౌట్; 3 ఫోర్లు) అజేయంగా నిలిచారు.