20 ఏళ్ల తర్వాత... ఈక్వెస్ట్రియన్‌లో ఒలింపిక్‌ బెర్త్‌

Equestrian Fouaad Mirza Seals Olympic Berth Ends Nearly 20 Year Wait - Sakshi

న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్‌ రైడర్‌ ఫౌద్‌ మీర్జా ఈక్వెస్ట్రియన్‌ (అశ్విక క్రీడలు)లో ఒలింపిక్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. ఆగ్నేసియా, ఓసియానియా క్వాలిఫయింగ్‌ జోన్‌ గ్రూప్‌ ‘జి’లో 27 ఏళ్ల ఫౌద్‌ మీర్జా టాప్‌ ర్యాంకర్‌గా నిలువడంతో అతనికి టోక్యో ఒలింపిక్స్‌లో వ్యక్తిగత ఈవెంటింగ్‌ కేటగిరీలో పాల్గొనే అవకాశం దక్కనుంది. భారత్‌ తరఫున ఒలింపిక్స్‌లో ఇంతియాజ్‌ (2000–సిడ్నీ), ఐజే లాంబా (1996– అట్లాంటా) మాత్రమే ఈక్వె్రస్టియన్‌లో ప్రాతినిధ్యం వహించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top