అంధుల క్రికెట్ టి20 ప్రపంచకప్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది.
న్యూఢిల్లీ: అంధుల క్రికెట్ టి20 ప్రపంచకప్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 129 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. తొలుత టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 279 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రకాశ్ (96; 18 ఫోర్లు), కేతన్ పటేల్ (98; 4 ఫోర్లు, ఒక సిక్స్) తృటిలో సెంచరీలు చేజార్చుకున్నారు. అనంతరం బంగ్లాదేశ్ ఏడు వికెట్లు నష్టపోయి 150 పరుగులే చేసి పరాజయం పాలైంది.