డీపీఎస్ ట్రోఫీ చెస్ చాంపియన్షిప్లో రంగారెడ్డి జిల్లా కుర్రాడు బాలకృష్ణ విజేతగా నిలిచాడు.
హైదరాబాద్: డీపీఎస్ ట్రోఫీ చెస్ చాంపియన్షిప్లో రంగారెడ్డి జిల్లా కుర్రాడు బాలకృష్ణ విజేతగా నిలిచాడు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోని కొమరయ్య చెస్ అకాడమీలో సోమవారం జరిగిన ఈ టోర్నీలో బాలకృష్ణ, తరుణ్ ఐదు రౌండ్లలోనూ విజయం సాధించారు. దీంతో ఇద్దరు 5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరుతో బాలకృష్ణ చాంపియన్షిప్ సాధించాడు. తరుణ్ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. చివరి రౌండ్లో బాలకృష్ణ... శ్రీనివాస్ను, తరుణ్... సురేందర్ను ఓడించారు.
వయో విభాగాల విజేతలు
అండర్-15 బాలురు: 1. కె.ప్రణవ్, 2. ఆరోమల్; బాలికలు: 1. శ్రావ్య, 2. పద్మప్రియా; అండర్-13 బాలురు: 1. కె. ఉమేశ్, 2. పి. కార్యశీల్; బాలికలు: 1. డి.శ్రీయా, 2. మధుబాల; అండర్-11 బాలురు: 1. ఆర్. విఘ్నేశ్, 2. నికుంజ్; బాలికలు: 1. అంజలి, 2. ముస్కాన్ జైన్; అండర్-9 బాలురు: 1. ఆరవ్ నంబియార్, 2. ధనుశ్ రెడ్డి; బాలికలు: 1. నిగమ శ్రీ, 2. భవజ్ఞ; అండర్-7 బాలురు: 1. గణేష్ సాయి, 2. లక్ష్ జైన్; బాలికలు: 1. రిమితా రెడ్డి, 2. శ్రాగ్వి