‘ఆయనలా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు’

TTD Chairman YV Subba Reddy Fires On Lokesh - Sakshi

సాక్షి, తిరుమల : టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఫైర్‌ అయ్యారు. లోకేష్‌లా తాను దొడ్డి దారిన రాజకీయాల్లోకి రాలేదన్నారు. దేవుడి సొమ్ము ఒక్క రూపాయి కూడా తాకబోనని, అవసరమైతే తాన చేతి నుంచే పదిమందికి సహాయం చేస్తానని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్న కారణంగా అక్కడ ఒక ఆఫీసు ఏర్పాటు చేయాలని కోరానే తప్ప.. ప్రత్యేకంగా చైర్మన్‌ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని తాను ఆదేశించలేదని స్పష్టం చేశారు. 

వీఐపీ దర్శనంలో మార్పులు
వీఐపీ దర్శనంలో టీటీడీ భారీ మార్పులు చేపట్టింది. వీఐటీ దర్శనాలైన ఎల్‌1, ఎల్‌2,  ఎల్‌3లను ఈ రోజు నుంచే పూర్తిగా రద్దు చేశారు. ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలను రద్దు చేశామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రోటోకాల్‌ పరిధిలోని వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారికి కల్పించాల్సిన సౌకర్యాలను అమలు చేస్తామని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top