మజ్లిస్‌ ఒత్తిడితోనే నాపై కేసు: రాజాసింగ్‌ | Raja singh about majlis party | Sakshi
Sakshi News home page

మజ్లిస్‌ ఒత్తిడితోనే నాపై కేసు: రాజాసింగ్‌

Sep 18 2018 2:42 AM | Updated on Oct 8 2018 8:39 PM

Raja singh about majlis party - Sakshi

హైదరాబాద్‌: మజ్లిస్‌ పార్టీ ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించిందని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా అనుమతి లేకుండా తిరంగ యాత్ర చేపట్టారంటూ అబిడ్స్‌ పోలీసులు ఇటీవల ఆయనకు నోటీసులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఆయన ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ను కలసి వివరణ ఇచ్చారు. అనంతరం రాజాసింగ్‌ మాట్లాడుతూ...తనపై ఎన్ని కేసులు బనాయించినా భయపడే ప్రసక్తే లేదన్నారు. తిరంగ ర్యాలీ నిర్వహించడం అన్యా యం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తిరంగ ర్యాలీ, స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించుకునే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని రాజాసింగ్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement