వదంతులు నమ్మొద్దు: బూచేపల్లి
ఒంగోలు: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వదంతులను వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా నాయకుడు, దర్శి నియోజకవర్గ ఇంఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తోసిపుచ్చారు. వైఎస్సార్ సీపీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీలో చేరుతున్నానన్న వదంతులను నమ్మొద్దని ఆయన కోరారు. జగనన్న నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు.