ఫ్లాట్‌ బాధితుల నోటా బాట.. | House Flat victims Are Turning Towards Nota In Noida | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌ బాధితుల నోటా బాట..

Mar 31 2019 9:50 AM | Updated on Mar 31 2019 9:50 AM

House Flat victims Are Turning Towards Nota In Noida - Sakshi

సాక్షి, సెంట్రల్‌డెస్క్‌ :  సాధారణంగా ఓటర్లు తమకు నచ్చిన పార్టీకి ఓటెయ్యాలని నిర్ణయించుకుంటారు.అయితే, ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో వేల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ‘నోటా’కు ఓటెయ్యాలని నిర్ణయించుకున్నారు. వారంతా నోయిడా ఫ్లాట్‌ కొనుగోలు బాధితులు. నోయిడా, గ్రేటర్‌ నోయిడాల్లో ఫ్లాట్ల కొనుగోలుకు వేల మంది సొమ్ము కట్టారు.

పదేళ్లయినా ఫ్లాట్లు అప్పగించకపోవడం, ఏ రాజకీయ నాయకుడు తమ సమస్యను పట్టించుకోకపోవడంతో ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ ఓటు వేయకూడదని వారు నిర్ణయించుకున్నారు. బాధితులు ఏర్పాటు చేసుకున్న ‘నోయిడా ఎక్స్‌టెన్షన్‌ ఫ్లాట్‌ ఓనర్స్‌ అండ్‌ మెంబర్స్‌ అసోసియేషన్‌ (నెఫోమా) ఆధ్వర్యంలో ‘నో హోం నో వోట్‌’ ప్రచారం చేపట్టారు. ఈ సంఘంలో 20 నుంచి 25 వేల మంది సభ్యులున్నారు. వీరితో సంబంధాలున్న వారు మరో లక్ష మంది ఉన్నారు.

నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంతాలు గౌతమ్‌ బుద్ధనగర్‌ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో కొత్తగా 5 లక్షల మంది ఓట్లు నమోదు చేసుకున్నారు. వీరిలో చాలామంది ఫ్లాట్‌ బాధితులున్నారు. రుద్ర ప్రాజెక్ట్స్‌లో వీళ్లు ఫ్లాట్‌లు బుక్‌ చేసుకున్నారు. 2015 నాటికే ఫ్లాట్లు అప్పగిస్తామని చెప్పిన ఆ సంస్థ ఇంత వరకు అప్పగించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయిందని, ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ ప్రభుత్వాలు వచ్చినా తమ కష్టం మాత్రం తీరలేదని నెఫోమా అధ్యక్షుడు అనూఖాన్‌ ఆరోపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement