ఏపికి సాయం చేస్తాం:ప్రధాని మోదీ | Will be Help to AP : PM Modi | Sakshi
Sakshi News home page

ఏపికి సాయం చేస్తాం:ప్రధాని మోదీ

Oct 12 2014 6:08 PM | Updated on Aug 15 2018 2:20 PM

నరేంద్ర మోదీ - Sakshi

నరేంద్ర మోదీ

హుదూద్‌ పెను తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు అవసరమైన సహాయం అందిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

న్యూఢిల్లీ: హుదూద్‌ పెను తుపాను దెబ్బకు  తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు అవసరమైన సహాయం అందిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.   ప్రధాని అధ్యక్షతన తుపానుపై అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్, హొంశాఖ, రక్షణ శాఖ కార్యదర్శులు, వాతావరణ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ ఏపి, ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తుపాను పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
**

Advertisement
 
Advertisement
Advertisement