కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం సమావేశమైంది.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం సమావేశమైంది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నెల 30న మరోసారి సమావేశం కావాలని కౌన్సిల్ నిర్ణయించింది. మిగిలిన వస్తువుల శ్లాబులపై సభ్యులు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. కౌన్సిల్ ఏర్పాటు తర్వాత జీఎస్టీ మండలి సమావేశం కావడం ఇది 17వసారి.
వివిధ రకాల వస్తువులకు ఇప్పటికే జీఎస్టీ శ్లాబులను మండలి ఖరారు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ భేటీకి తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఐటీశాఖమంత్రి కేటీఆర్, ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని యనమల జీఎస్టీ కౌన్సిల్ను కోరారు. అలాగే బీడీ, గ్రానైట్, మిషన్ భగీరథ పనులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేటీఆర్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు.