నదిలో పడిపోయిన స్కూల్ బస్సు | Villagers saves 50 children from drowning bus in Bhilwara | Sakshi
Sakshi News home page

నదిలో పడిపోయిన స్కూల్ బస్సు

Aug 8 2016 12:16 PM | Updated on Sep 4 2017 8:25 AM

నదిలో పడిపోయిన స్కూల్ బస్సు

నదిలో పడిపోయిన స్కూల్ బస్సు

పాఠశాల బస్సు వరద ఉధృతికి నదిలో పడిపోయిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 50 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు.  రెండు రోజులుగా రాష్ట్రంలోని బిల్వారా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు స్థానికంగా నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఆచార్య విద్యాసాగర్ పాఠశాలకు చెందిన బస్సు సోమవారం ఓ చిన్న వంతెనను దాటుతుండగా.. నది ఉధృత ప్రవాహానికి అదుపుతప్పి నదిలో పడిపోయింది. బస్సు నీటిలో మునిగిపోతుండటం గమనించిన సమీపంలోని ప్రజలు చిన్నారులను కాపాడారు. స్థానికులు సకాలంలో సాహసంతో కూడిన పనిచేశారని చిన్నారుల తల్లిదండ్రులు, అధికారులు అభినందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement