ఒక్క సిక్కింకే వెళ్లలేదు! | V-P Venkaiah Naidu visits 28 states in his first year as V-P | Sakshi
Sakshi News home page

ఒక్క సిక్కింకే వెళ్లలేదు!

Aug 12 2018 4:58 AM | Updated on Aug 12 2018 4:58 AM

V-P Venkaiah Naidu visits 28 states in his first year as V-P - Sakshi

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి నేడు ఏడాది  పూర్తిచేసుకుంటున్న వెంకయ్యనాయుడు అరుదైన ఘనత సాధించారు. ఆయనకు ముందు పదేళ్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్‌ అన్సారీ తన పదవీకాలంలో 26 రాష్ట్రాల్లో పర్యటించారు. కానీ వెంకయ్య ఏడాది కాలంలో ఒక్క సిక్కిం మినహా మిగిలిన 28 రాష్ట్రాల్లో పర్యటించారు. సిక్కిం పర్యటనకూ బయల్దేరిన వెంకయ్య ప్రతికూల వాతావరణం వల్ల అర్ధంతరంగా వెనుదిరిగారు. వెంకయ్య సిక్కిం మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించగా, అన్సారీ మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, అస్సాంలోనే పర్యటించారు.

Advertisement
 
Advertisement
Advertisement