కశ్మీర్లో ఉగ్రదాడి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో ఒక పోలీసు, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఎదురుదాడిలో ఉగ్రవాది హతమయ్యాడు.
ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టేందుకు ఎదురుకాల్పులు జరిపామని పోలీసు అధికారులు తెలిపారు. కాల్పుల్లో పోలీసు సిబ్బంది ఒకరు మరణించారని, అలాగే ఒక మిలిటెంట్ హతం కాగా.. మరో ఇద్దరు మృతిచెందినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.