పట్టాలు తప్పిన జమ్ముతావి: ఇద్దరి మృతి? | tata nagar-jammu express, derailed, feared 1dead | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన జమ్ముతావి: ఇద్దరి మృతి?

May 25 2015 3:09 PM | Updated on Oct 1 2018 5:19 PM

ఉత్తర ప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జమ్ము తావి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లక్నో: ఉత్తర ప్రదేశ్లోని  కౌశాంబి జిల్లాలో  రైలు ప్రమాదం చోటు చేసుకుంది.  జమ్ము  తావి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్టుగా  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయని, దాదాపు వందమందికి పైగా గాయాలయ్యాయని  పోలీసులు తెలిపారు.


సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల నుపర్యవేక్షిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement