వారాంతంలో సుష్మకు మూత్రపిండ మార్పిడి? | Sakshi
Sakshi News home page

వారాంతంలో సుష్మకు మూత్రపిండ మార్పిడి?

Published Wed, Dec 7 2016 1:28 AM

వారాంతంలో సుష్మకు మూత్రపిండ మార్పిడి?

న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఈ వారాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది. రక్త సంబంధీకుడు కాని దాత నుంచి కిడ్నీ సేకరిస్తున్నట్లు సమాచారం. రోగి బంధువులే కాకుండా స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఇరుగు పొరుగువారు.. ఎవరైనా అవయవ దానం చేయవచ్చని చట్టం చెబుతోంది.

కిడ్నీ మార్పిడి ప్రక్రియకు దాత, గ్రహీతలకు ముందస్తు పరీక్షలన్నీ పూర్తి చేసినట్లు వైద్యులు చెప్పారు. ఎరుుమ్స్‌లోని నిపుణులైన వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement