పటియాల కోర్టులో శాంతిభద్రతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: పటియాల కోర్టులో శాంతిభద్రతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తాము సీరియస్గా పరిగణిస్తున్నామని పేర్కొంది. అనవసర వ్యాఖ్యలు చేయడం ద్వారా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
కన్హయ్ వ్యతిరేక న్యాయవాదులను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మందలించింది. పటియాల కోర్టులో జరుగుతున్న పరిణామాలన్నింటిని తాను చూస్తూనే ఉన్నానంటూ స్పష్టం చేసింది. కాగా, కన్హయ్యకు బెయిల్ ఇవ్వడాన్ని ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించలేదు.