ఆమ్ ఆద్మీకి డబుల్ షాక్ | Shazia Ilmi, Gopinath quit AAP | Sakshi
Sakshi News home page

ఆమ్ ఆద్మీకి డబుల్ షాక్

May 24 2014 6:53 PM | Updated on Sep 2 2017 7:48 AM

ఆమ్ ఆద్మీ పార్టీకి డబుల్ షాక్ తగిలింది. కేజ్రీవాల్ పోకడలను వ్యతిరేకిస్తూ పార్టీని వీడుతున్నట్టు గోపీనాథ్, షాజియా ప్రకటించారు.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి డబుల్ షాక్ తగిలింది. శనివారం ఇద్దరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోకడలను వ్యతిరేకిస్తూ పార్టీని వీడుతున్నట్టు గోపీనాథ్, షాజియా ప్రకటించారు.

పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు షాజియా చెప్పారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని ఆమె విమర్శించారు. బెంగళూరుకు చెందిన గోపీనాథ్ కూడా కేజ్రీవాల్పై విరుచుకుపడ్డారు. పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ పూచీకత్తుపై బెయిల్ తీసుకోకుండా జైలుకెళ్లడాన్ని తప్పుపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement