యూజీసీ చైర్మన్‌గా ధీరేంద్ర పాల్‌ సింగ్‌

Professor Dhirendra Pal Singh appointed UGC chairman - Sakshi

న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ధీరేంద్ర పాల్‌ సింగ్‌ను నియమిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (నాక్‌) డైరెక్టర్‌గా ఉన్నారు. ధీరేంద్ర ఐదేళ్లపాటు యూజీసీ చైర్మన్‌ పదవిలో కొనసాగుతారని సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) తెలిపింది. కాగా, ప్రొఫెసర్‌ వేద్‌ ప్రకాశ్‌ యూజీసీ చైర్మన్‌గా 2017 ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందినప్పటినుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top