'ఆపార్టీ నేతలే వ్యతిరేకించటం హాస్యాస్పదం' | Polavaram bill Constitutional, says M.Venkaiah naidu | Sakshi
Sakshi News home page

'ఆపార్టీ నేతలే వ్యతిరేకించటం హాస్యాస్పదం'

Jul 12 2014 2:04 PM | Updated on Aug 21 2018 8:34 PM

'ఆపార్టీ నేతలే వ్యతిరేకించటం హాస్యాస్పదం' - Sakshi

'ఆపార్టీ నేతలే వ్యతిరేకించటం హాస్యాస్పదం'

పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. శనివారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజనకు ముందే ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. 1956కు ముందు ముంపు మండలాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయో తెలుసుకోవాలని ఆయన తెలంగాణ నేతలకు హితవు పలికారు. పోలవరం ఆర్డినెన్స్ వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. గత కాంగ్రెస్ హయాంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అలాంటిది ఆ పార్టీ నేతలే వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

 

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన సంగతి ఈ సందర్బంగా వెంకయ్య గుర్తు చేశారు. పోలవరం ఆర్డినెన్స్ ఆమోదంలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదని ఆయన స్సష్టం చేశారు. పోలవరం బిల్లుపై మరింత లోతైన చర్చ జరిగితే బాగుండేదని వెంకయ్య అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement