బంగారం నిక్షేపాలు అబద్ధం: జీఎస్‌ఐ | No Discovery of 3000-tonne Gold Deposits in Uttar Pradesh is Sonbhadra | Sakshi
Sakshi News home page

బంగారం నిక్షేపాలు అబద్ధం: జీఎస్‌ఐ

Feb 23 2020 6:03 AM | Updated on Feb 23 2020 6:03 AM

No Discovery of 3000-tonne Gold Deposits in Uttar Pradesh is Sonbhadra - Sakshi

కోల్‌కతా/సోన్‌భద్ర: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3వేల టన్నుల బంగారం నిల్వలు బయటపడ్డాయంటూ వచ్చిన వార్తలు వట్టివేనని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ)స్పష్టం చేసింది. ‘సోన్‌భద్రలో అంత భారీగా బంగారు నిల్వలను మేం కనుగొనలేదు. అటువంటి సమాచారమేదీ మేం ఇవ్వలేదు’ అని జీఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.శ్రీధర్‌ కోల్‌కతాలో శనివారం మీడియాకు తెలిపారు. తమ అన్వేషణలో ఇదే జిల్లాలో దాదాపు 52వేల టన్నుల ఇనుప ఖనిజం బయటపడిందనీ, ఇందులో టన్నుకు 3.03 గ్రాముల చొప్పున సాధారణ స్థాయిలో బంగారం ఉన్నట్లు తేలిందన్నారు. బహుశా ఈ వార్తనే సోన్‌భద్ర జిల్లా అధికారులు మరోలా వెల్లడించి ఉంటారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement