ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ (75) తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ (75) తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం అస్వస్థతకు గురైన ములాయం గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చినట్టు వైద్య వర్గాలు చెప్పాయి.
వైద్య పరీక్షల అనంతరం మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని ములాయంకు సూచించినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. కాగా సాధారణ పరీక్షల కోసమే ములాయం ఆస్పత్రికి వెళ్లినట్టు సమాజ్వాదీ పార్టీ వర్గాలు చెప్పాయి.