నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో తొలి తీర్పును జునైనల్ కోర్టు వెలువరించింది.
ఢిల్లీ: నిర్భయ చట్ట ప్రకారం గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధింఇచి తొలి తీర్పును జునైనల్ కోర్టు శనివారం వెలువరించింది. ఓ బాలనేరస్థుడికి శిక్షను ఖరారు చేస్తూ జునైనల్ కోర్టు సంచలనం తీర్పు ప్రకటించింది. నలుగురు యువకులు కలిసి 23 సంవత్సరాల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై కోర్టు ఈ తీర్పును వెలువరించింది. 2012, డిసెంబర్ 16 వ తేదీన బస్సులో ప్రయాణిస్తున్నమహిళపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వారిలో ఓ మైనర్ బాలుడు ఉండటంతో కేసు విచారణను జునైనల్ కోర్టు స్వీకరించింది.
శిక్ష పడిన బాలుడ్ని మూడేళ్లు ప్రత్యేక హోంలో ఉంచాలంటూ మేజిస్ర్టేట్ గీతాంజలి గోయల్ ఆదేశాలు జారీ చేశారు. గత ఎనిమిది నెలలుగా జైలు జీవితం గడుపుతూ శిక్ష అనుభవిస్తున్న ఆ బాలుడి గత జూన్ లో మేజర్ గా అర్హత సాధించాడు. మిగతా నలుగురిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ కొనసాగుతోంది.