చత్తీస్గఢ్లోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు.
ఛత్తీస్గఢ్లో మావోల దుశ్చర్య
Feb 27 2017 12:10 PM | Updated on Oct 9 2018 2:53 PM
- రూ. 5 కోట్ల ఆస్తి నష్టం
ఛత్తీస్గఢ్: చత్తీస్గఢ్లోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లాలోని సిరోంచ తాలూకా రోంపల్లి అటవీ శాఖకు చెందిన కలప డిపోకు ఆదివారం రాత్రి మావోయిస్టులు నిప్పుపెట్టారు. దీంతో సుమారు రూ. 5 కోట్ల విలువైన కలప కాలి బూడిదైంది. మావోయిస్టులు సోమవారం బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా మావోయిస్టుల పోస్టుర్లు వెలిసాయి. మావోల బంద్ నేపథ్యంలో ఖమ్మం జిల్లా చర్లలో వ్యాపారులు దుకాణాలు మూసి వేశారు.
Advertisement
Advertisement