నార్త్ బ్లాక్‌లో కమలనాథన్ కమిటీ భేటీ | Kamalanathan committee meeting on employee allotment | Sakshi
Sakshi News home page

నార్త్ బ్లాక్‌లో కమలనాథన్ కమిటీ భేటీ

Jul 25 2014 11:29 AM | Updated on Jul 29 2019 5:59 PM

ఉద్యోగుల విభజనకు కేంద్రం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ శుక్రవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో సమావేశమైంది.

న్యూఢిల్లీ : ఉద్యోగుల విభజనకు కేంద్రం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ శుక్రవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో  సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్‌శర్మ, వైవీఆర్ కృష్ణారావు హాజరు అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై ఈ భేటీలో చర్చ జరుపుతున్నారు.

ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసిన తరువాత వాటిని అభిప్రాయాల కోసం బహిరంగపరుస్తారు. ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలకు అనుగుణంగా తుది మార్గదర్శకాలను ప్రధానమంత్రి ఆమోదంతో ప్రకటించనున్నారు. అనంతరం ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను చేపడతారు.

 

Advertisement
 
Advertisement
Advertisement