సీఎంకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టి బుక్కయ్యాడు | Journalist held for Facebook post on Himachal Pradesh CM | Sakshi
Sakshi News home page

సీఎంకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టి బుక్కయ్యాడు

Nov 6 2015 10:19 AM | Updated on Jul 26 2018 1:02 PM

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కు విరుద్ధంగా కమెంట్ చేసి ఇబ్బందుల్లో పడ్డాడో జర్నలిస్టు

షిమ్లా:   హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి  వీరభద్ర సింగ్ కు  వ్యతిరేకంగా వ్యాఖ్యలు  చేసి  ఇబ్బందుల్లో పడ్డాడో జర్నలిస్టు. రాష్ట్రంలోని మాంది నగరానికి  చెందిన రాజేశ్  శర్మ  గురువారం సోషల్ మీడియాలో సీఎం కు వ్యతిరేకంగా  కామెంట్స్  పోస్ట్  చేశాడు.    దీంతో దుమారం రేగింది. తమ నేత ప్రతిష్టకు భంగం కలిగేలా రాజేశ్ శర్మ ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ నాయకుడు పూరన్ చాంద్ పోలీసులకు ఫిర్యాదు  చేశాడు. దీంతో  జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇండియన్ పీనల్ కోడ్ లోని వివిధ సెక్షన్ల కింద అతడిపై  కేసులు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement