భారత సైన్యం ఎలా కదిలిందంటే? | indian army prepared plan 7 days back | Sakshi
Sakshi News home page

భారత సైన్యం ఎలా కదిలిందంటే?

Sep 29 2016 4:11 PM | Updated on Mar 23 2019 8:33 PM

భారత సైన్యం ఎలా కదిలిందంటే? - Sakshi

భారత సైన్యం ఎలా కదిలిందంటే?

భారత్, పాక్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలు చేపట్టిన సర్జికల్ దాడుల వివరాలను భారత సైన్యం అధికారికంగా ఆయా రాజకీయ పార్టీల సీనియర్లకు, అగ్ర నాయకులకు, ముఖ్యమంత్రులకు చాలా స్పష్టంగా వివరించింది.

న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలు చేపట్టిన సర్జికల్ దాడుల వివరాలను భారత సైన్యం అధికారికంగా ఆయా రాజకీయ పార్టీల సీనియర్లకు, అగ్ర నాయకులకు, ముఖ్యమంత్రులకు చాలా స్పష్టంగా వివరించింది. అర్థరాత్రి 12.30గంటల ప్రాంతంలో మొదలు పెట్టిన ఈ ఆపరేషన్ తెల్లవారు జామున 4.30గంటల ప్రాంతంలో ముగిసినట్లు వివరించింది. ఊడీ ఉగ్రదాడి నేపథ్యంలో తొలిసారి పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత సైన్యం దాదాపు ఎనిమిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదులను మట్టికరిపించిన విషయం తెలిసిందే.

ఈ దాడి జరిగిన తర్వాత ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ పాక్ ఈ విషయం చేరవేశారు. అనంతరం ప్రత్యేక మీడియా సమావేశం పెట్టి తాము దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణాలు చెప్పడంతోపాటు తాజాగా జరిపిన దాడి గురించి ఆర్మీ తరుపున ఆయా ముఖ్యమంత్రులకు అగ్రనేతలకు చెప్పారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ దాడి వివరాలను తెలియజేశారు. సైన్యం చెప్పిన వివరాల ప్రకారం సైన్యం ఆపరేషన్ కు ఎలా కదిలిందంటే..

  • ఉడీ ఉగ్రదాడి చేసేందుకు ముందు పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు పెద్దపెద్ద కొండ ప్రాంతాల నుంచి రెక్కీ నిర్వహించినట్లు తెలుసుకున్నారు.
  • ఉడీ ఉగ్రదాడిలో నలుగురు ఉగ్రవాదులే హతమయ్యారు. దీని ప్రకారం మరింత మంది ఉగ్రవాదులు సమీప ప్రాంతంలోని ఉన్నట్లు సమాచారం అందింది.
  • దీంతో వారం రోజుల ముందే భారత సైన్యం ప్రణాళిక సిద్ధం చేసి నిఘా ప్రారంభించింది.
  • వారు ఏ క్షణంలోనైనా మరోసారి దాడి చేయొచ్చని నిఘా సమాచారం అందింది. దీంతో బదులు చెప్పాలని నిర్ణయించుకున్న సైన్యం నియంత్రణ రేఖను తొలిసారి దాటి పాకిస్థాన్ భూభాగం వైపు 500 మీటర్ల నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు ముందుకు కదిలాయి.
  • వివిధ సెక్టార్లలోని ఎనిమిది స్థావరాలపై దాడి చేశాయి.
  • ఈ ఆపరేషన్‌ నిర్వహించేందుకు భారత ఆర్మీ పారాకమాండోస్‌, హెలికాప్టర్లను ఉపయోగించారు. బలగాలను ఈ హెలికాప్టర్ల ద్వారా అనుమానిత ప్రాంతంలోకి దించారు.
  • ఒక్కసారిగా అనూహ్యంగా భారత్ సైన్యం నిర్వహించిన సర్జికల్ ఆపరేషన్ లో ఉగ్రవాద శిబిరాలకు భారీ నష్టం చోటుచేసుకుంది.
  • దాదాపు 38మంది ఉగ్రవాదులు హతమై మరికొందరు బందీగా తీసుకున్నారు
  • ఉగ్రవాద స్థావరాల్లో ప్రత్యర్ధుల నుంచి లభించిన ఆయుధాలు అన్నీ కూడా పాక్ కు చెందినవని గుర్తించారు.
  • ఈ దాడిలో హతమైనవారు పాక్ ప్రాంతానికి చెందినవారు, పాక్ ఆక్రమితి కశ్మీర్ కు చెందినవారని తెలిసింది.
  • ఈ దాడిలో కేవలం ఉగ్రవాదులే కాకుండా వారికి దారి చూపించేవారు, శిబిరాల నిర్వాహకులు కూడా ఉండటంతో ఎక్కువమంది గాయపడ్డారు.
  • ఈ దాడిలో హతమైన వారంతా జమ్మూకశ్మీర్ తోపాటు ఇతర మెట్రో నగరాలపై దాడులు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement