ఆ గ్రామస్థులు... గ్రామ పెద్దల నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నారు. హర్యానా భివానీ జిల్లాలోని చందేని గ్రామంలో పంచాయితీ సభ్యులు చేసిన ప్రత్యేక తీర్మానానికి ప్రజలంతా ఆమోదం తెలిపారు. వివాహానికి ముందే వధూవరులు హెచ్ఐవీ పరీక్షలను చేయించుకోవాలన్న ఆలోచనను ప్రోత్సహిస్తున్నారు.
సర్పంచ్ మమతా సంగ్వాన్ తో సహా పదిమంది పంచాయితీ సభ్యులను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారంతా ఇప్పుడు గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపడంతోపాటు... స్థానిక ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఇందులో భాగంగానే వివాహానికి ముందు వధూవరులు హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామ పెద్దల ఆలోచనతో ఏకీభవించిన ధరమ్ జిత్ గ్రేవాల్, ముఖేష్ రాణిలు తమ హెచ్ఐవీ రిపోర్టులను సర్పంచ్ కు అందజేశారు. గ్రామస్తుల్లో ఎక్కువశాతం విద్యావంతులేనని, వారందరికీ వ్యాధివల్ల వచ్చే సమస్యలు, ఇబ్బందులు తెలుసునని అందుకే పంచాయితీ తీర్మానాన్ని ఆమోదించి తాము పరీక్షలు చేయించుకున్నామని ధరమ్ జిత్ గ్రేవాల్ అన్నారు. ముందుగానే పరీక్షలు చేయించుకొని పంచాయితీ పెద్దలను రిసెప్షన్ కు ఆహ్వానించి అందరి సమక్షంలో వారికి రిపోర్టులు సమర్పించామని తెలిపారు.
తనకు ఈ ఆలోచనను గ్రామ కార్యకర్త, రంగస్థల నటుడు అయిన సంజయ్ రాంఫాల్ సూచించారని, అయితే తమ ఆలోచన తప్పనిసరిగా అమలవుతుందన్న నమ్మకం గట్టిగా ఉందని సర్పంచ్ మమత చెప్తున్నారు. అంతేకాక వివాహం చేసుకున్న నూతన దంపతులకు ఓ తులసి మొక్కను బహూకరించి, వారితో ప్రతిజ్ఞ కూడ చేయించేందుకు పంచాయితీ సభ్యులు నిర్ణయించారు. హెచ్ఐవీ ఎన్నో జీవితాలను బలి చేస్తోందని, ఆ వ్యాధితో తమ గ్రామంలో ఎవరూ మరణించకూడదన్నదే తమ లక్ష్యమని పంచాయితీ సభ్యులు అంటున్నారు. తమ గ్రామంలోనే కాక పరిసర గ్రామాల ప్రజలకు కూడ హెచ్ఐవీపై అవగాహన కల్పించేందుకు ప్రయత్సిస్తున్నామని వారు చెప్తున్నారు.
మొదటి మహిళా గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన మమత పట్టభద్రు రాలు. ఆమె భర్త హితేష్ ఆర్మీలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అయితే గ్రామస్థుల ఆరోగ్యమే ధ్యేయంగా తీసుకున్న ఈ నిర్ణయం... వధూవరులకు అంగీకారమైతేనే పాటించవచ్చని, టెస్టులు చేయించుకోడానికి ఎటువంటి బలవంతం లేదని ఆమె చెప్తున్నారు.
అక్కడ పెళ్ళికి ముందే హెచ్ఐవీ పరీక్షలు!
Published Fri, Jan 22 2016 8:31 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement