నాల్గవరోజూ తగ్గిన ఇంధన ధరలు | fuel prices come down by 87 paise | Sakshi
Sakshi News home page

నాల్గవరోజూ తగ్గిన ఇంధన ధరలు

Oct 22 2018 3:37 AM | Updated on Oct 22 2018 3:37 AM

fuel prices come down by 87 paise - Sakshi

న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో చమురు సంస్థలు కూడా స్వల్పంగా ఇంధన ధరలను తగ్గించాయి. ఇంధన ధరల తగ్గింపు వరుసగా నాల్గవరోజైన ఆదివారం కూడా కొనసాగింది. ఆదివారం లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 17పైసలను సంస్థలు తగ్గించాయి. దీంతో సవరించిన రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 81.74 ఉండగా, డీజిల్‌ ధర రూ.75.19 గా ఉంది.  వరుసగా నాలుగురోజులపాటు చమురు ధరలను తగ్గించడంతో మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో లీటరు పెట్రోల్‌పై రూ.1.09, డీజిల్‌పై 50 పైసలు తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement