నాలుగేళ్ల బాలుడిపై అత్యాచారం

నాలుగేళ్ల బాలుడిపై అత్యాచారం - Sakshi


గుర్గావ్: హర్యానాలో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడిపై ఓ టీనేజీ కుర్రాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్గావ్లో నివసించే నాలుగేళ్ల బాలుడిపై పదిహేనేళ్ల కుర్రాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పొరుగింట్లో ఉండే యువకుడు ఒంటరిగా ఉన్న బాలున్ని ప్రలోభపెట్టి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 


అత్యాచారానికి గురైన బాలుడి సోదరుడితో నిందితుడు చనువుగా ఉండేవాడని పోలీసులు వెల్లడించారు. బాలుడి తల్లి పనిమీద బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం బయటకు రావడంతో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతనిపై లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top