'పాలేరు' కోసం టీడీపీ నేతలు డిష్యూం డిష్యూం | Fighting between Two TDP Leaders due to paleru constituency ticket | Sakshi
Sakshi News home page

'పాలేరు' కోసం టీడీపీ నేతలు డిష్యూం డిష్యూం

Apr 5 2014 11:39 AM | Updated on Sep 2 2017 5:37 AM

'పాలేరు' కోసం టీడీపీ నేతలు డిష్యూం డిష్యూం

'పాలేరు' కోసం టీడీపీ నేతలు డిష్యూం డిష్యూం

ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు మరోసారి రచ్చకెక్కింది.

ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు మరోసారి రచ్చకెక్కింది. పాలేరు శాససనభ నియోజకవర్గాన్ని తనకే కేటాయించాలని జిల్లా శాసనసభ్యుడు  తుమ్మల నాగేశ్వరరావు  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కోరడాన్ని స్థానిక ఎంపి నామా నాగేశ్వరరావు శనివారం ఖమ్మంలో తప్పు పట్టారు. పాలేరు టికెట్ ఎప్పటి నుంచో స్వర్ణకుమారి ఆశిస్తున్నారని ఈ సందర్బంగా నామా గుర్తు చేశారు.

 

ఆమెకు పాలేరు టికెట్ ఇవ్వడమే సముచితమన్నారు. అయితే పాలేరు టికెట్ ఆమెకు దక్కకుండా  తానే దక్కించుకోవాలని తుమ్మల ఆరాట పడుతున్నారని నామా ఆరోపించారు. తుమ్మల అలా చేస్తే ఓ ఆడబిడ్డకు అన్యాయం చేసినట్లే అవుతుందని నామా నాగేశ్వరరావు విమర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement