నోటు సమస్య నుంచి ఓ రాష్ట్రం బయటపడింది! | Demonetisation: Mizoram limping back to normalcy | Sakshi
Sakshi News home page

నోటు సమస్య నుంచి ఓ రాష్ట్రం బయటపడింది!

Nov 24 2016 5:35 PM | Updated on Sep 4 2017 9:01 PM

నోటు సమస్య నుంచి ఓ రాష్ట్రం బయటపడింది!

నోటు సమస్య నుంచి ఓ రాష్ట్రం బయటపడింది!

పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి తాము బయటపడ్డామని, ఇప్పుడు అంతపెద్ద ఇబ్బందులు రావడం లేదని, ఇక రూ.500 నోట్లు కూడా బ్యాంకులకు చేరితే సమస్య పోయనట్లేనని మిజోరం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌ లోని ఎస్‌బీఐ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ప్రదీప్‌ కుమార్‌ సేన్‌ అన్నారు.

ఐజ్వాల్‌: పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి తాము బయటపడ్డామని, ఇప్పుడు అంతపెద్ద ఇబ్బందులు రావడం లేదని, ఇక రూ.500 నోట్లు కూడా బ్యాంకులకు చేరితే సమస్య పోయనట్లేనని మిజోరం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌ లోని ఎస్‌బీఐ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ప్రదీప్‌ కుమార్‌ సేన్‌ అన్నారు.

16 రోజుల తర్వాత తమ బ్యాంకులు సాధారణ పరిస్థితులతో నడుస్తున్నాయని, హడావుడి తగ్గిపోయిందని, బ్యాంకుల ముందు క్యూలు తగ్గిపోయాయని, ఏటీఎంల వద్ద కూడా అంతా బాగానే ఉందని ఆయన గురువారం మీడియాకు చెప్పారు. రిజర్వ్‌ బ్యాంకు నుంచి తమకు రావాల్సిన మొత్తం ఆదివారం రాత్రి చేరుకుందని.. ఇంకొంత వస్తుందని అది కూడా త్వరలోనే కొత్త రూ.500 నోట్లతో ఉంటుందని తాము భావిస్తున్నామని, లావాదేవీలు కూడా సులువుగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement