'బీజేపీ తప్ప మిగిలిన వారంతా రాజద్రోహులా...' | CPI Leader suravaram sudhakar reddy fires on central govt | Sakshi
Sakshi News home page

'బీజేపీ తప్ప మిగిలిన వారంతా రాజద్రోహులా...'

Feb 22 2016 4:05 PM | Updated on Aug 20 2018 9:16 PM

'బీజేపీ తప్ప మిగిలిన వారంతా రాజద్రోహులా...' - Sakshi

'బీజేపీ తప్ప మిగిలిన వారంతా రాజద్రోహులా...'

కేంద్రప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ... బీజేపీ నాయకులు తప్ప మిగిలిన వారంతా రాజద్రోహులా అని ప్రశ్నించారు. జేఎన్యూ విద్యార్ధి నాయకుడు కన్హయ్య కుమార్పై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వ వైఖరిపై పోరాటం కొనసాగిస్తామని సురవరం పునరుద్ఘాటించారు. కాగా రాజద్రోహం కేసులో కన్హయ్య కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement