కరోనా : 60 వేలకు చేరువలో పాజిటివ్‌ కేసులు | Coronavirus: 3320 New Cases And 95 Deaths Registered In India | Sakshi
Sakshi News home page

కరోనా : 24 గంటల్లో 3,320 కొత్త కేసులు

May 9 2020 10:11 AM | Updated on May 9 2020 11:15 AM

Coronavirus: 3320 New Cases And 95 Deaths Registered In India - Sakshi

దేశంలో ప్రస్తుతం 39,834మంది చికిత్స పొందుతున్నారు

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనావైరస్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా సరాసరిగా మూడు వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,320 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో శనివారం ఉదయం నాటికి భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 59,662కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 95 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 1981కి చేరింది. ఈ మహమ్మారి నుం​చి కోలుకొని 17,847 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో ప్రస్తుతం 39,834మంది చికిత్స పొందుతున్నారు.
(చదవండి : కరోనా: అందుకే మనదేశంలో మరణాలు తక్కువ)

ఇక అత్యధికంగా మహారాష్ట్రంలో 19,063 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 7402, ఢిల్లీలో 6318, మధ్యప్రదేశ్‌లో 3341, రాజస్తాన్‌లో 3579, తమిళనాడులో 6009, ఉత్తరప్రదేశ్‌లో 3214 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement