కాన్ఫ్లిక్ట్ జోన్ జమ్మూ వర్సెస్ కశ్మీర్
జమ్మూ కశ్మీర్లోని బీజేపీ– పీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని మరో వివాదం చుట్టుముట్టింది. దేశ విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్ నుంచి భారత్కు తరలివచ్చిన శరణార్థులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం తాజా వివాదానికి కారణం. ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని, ఇది రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని నీరుగార్చడమేనని నేషనల్ కాన్ఫరెన్స్, వేర్పాటువాద నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు బీజేపీ, వీహెచ్పీ, శ్రీరామ్సేన, పాంథర్స్ పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
ఏమిటీ గుర్తింపు పత్రాలు?
దేశ విభజన అనంతరం, పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన వారిని శరణార్థులుగా గుర్తిస్తూ వారి పేరు, తల్లిదండ్రుల పేర్లతో పాటు ఫొటో ముద్రించి ఉన్న గుర్తింపు ధ్రువపత్రాలను ప్రభుత్వం జారీ చేస్తోంది. నైబ్ తహసీల్దార్ వీటిని జారీ చేస్తారు. అవిభాజ్య భారత్లో నివసిస్తున్న సదరు వ్యక్తి, దేశ విభజన అనంతరం భారత్కు తరలివచ్చినట్లు, ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లోని పలానా ప్రాంతంలో అతడు నివసిస్తున్నట్లు ఈ నివాస గుర్తింపు ధ్రువపత్రం తెలియజేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో శరణార్థులకు ఇది ఉపయోగపడుతుంది.
ఎంతమంది తరలివచ్చారు?
తాజా గణాంకాలు అందుబాటులో లేవు. 1951 వివరాల ప్రకారం విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్ నుంచి 72,95,870 మంది భారత్కు తరలివచ్చారు. వారిలో సుమారు 47 లక్షల మంది పశ్చిమ పాకిస్తాన్ నుంచి తరలివచ్చిన హిందువులు, సిక్కులు. 5,764 కుటుంబాలు మినహా, మిగిలిన వారందరూ పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ముంబైలలో స్థిరపడ్డారు. జమ్మూకు తరలివచ్చిన ఆ 5,784 కుటుంబాలకు చెందిన వారిని మాత్రం జమ్మూ కశ్మీర్ స్థిర నివాసులుగా గుర్తించలేదు. గత ఏడు దశాబ్దాల్లో ఈ కుటుంబాలు 19,760 కుటుంబాలుగా విస్తరించాయి. వీటిలో 20 ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి.
ఎవరు వ్యతిరేకిస్తున్నారు?
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పాటు వేర్పాటువాద నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. లోయలో నిరసనలకు వేర్పాటువాద నేతలు పిలుపునిచ్చారు. ముస్లిం మెజారిటీ రాష్ట్రంలో.. జనాభాలో మార్పు తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అయితే శరణార్థులు గత ఏడు దశాబ్దాలుగా కశ్మీర్లో నివసిస్తున్నారని, అలాంటప్పుడు జనసంఖ్యలో ఎలా మార్పు వస్తుందని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్న వారు ప్రశ్నిస్తున్నారు. ‘రోహింగ్యా ముస్లింలకు ప్రభుత్వం మద్దతు తెలిపితే సమస్య లేదు కానీ పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులకు మద్దతిస్తే సమస్య వస్తోందా?’ అని శరణార్థులు వేర్పాటువాద నేతలను ప్రశ్నిస్తున్నారు.
రోహింగ్యాలతో సమస్య ఏమిటి?
మయన్మార్లో సుమారు పది లక్షల జనాభా ఉన్న బలమైన ముస్లిం సామాజిక వర్గమే రోహింగ్యాలు. అయితే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చారనే కారణంగా అక్కడి ప్రభుత్వం వీరిలో చాలామందికి పౌరసత్వం కల్పించలేదు. విచారణ నుంచి తప్పించుకునేందుకు చాలా మంది భారత్, బంగ్లాదేశ్, థాయ్లాండ్, ఇండొనేసియా దేశాలకు పారిపోయారు. ప్రస్తుతం భారత్లో సుమారు 40 వేల నుంచి 50 వేల మంది రోహింగ్యాలు నివసిస్తున్నట్లు అంచనా. జమ్మూ కశ్మీర్లో సుమారు 7 వేల–8 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది ఇళ్లలోనూ, ప్రైవేటు వాణిజ్య సంస్థల్లో కార్మికులుగా జీవిస్తున్నారు.
రోహింగ్యాల జనాభా వాస్తవంగా ఇంకా ఎక్కువగానే ఉంటుందని చాలా మంది జమ్మూ ప్రజల విశ్వాసం. నిధులు, నియామకాలు ఎక్కువగా కశ్మీరీ ముస్లింలకే దక్కుతున్నాయని భావిస్తున్న హిందూ ప్రాబల్య జమ్మూ ప్రజలు... రోహింగ్యా ముస్లింలు స్థిరపడుతుండడాన్ని అనుమానంతో చూస్తున్నారు. జమ్మూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రోహింగ్యాలు స్థానికులను వివాహం చేసుకోవడం, తద్వారా ఆ ప్రాంత జనాభాలో మార్పు తెచ్చే ప్రయత్నం జరుగుతోందని వారు భావిస్తున్నారు. పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, రోహింగ్యా ముస్లింల విషయంలో జమ్మూ, కశ్మీర్ మధ్య çకొత్త వివాదం తలెత్తింది.
శరణార్థి సంక్షోభం!
Published Sun, Jan 1 2017 4:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement