పక్షి ఢీ.. తప్పిన పెను ప్రమాదం! | Chennai and Doha IndiGo flight suffered bird hit | Sakshi
Sakshi News home page

పక్షి ఢీ.. తప్పిన పెను ప్రమాదం!

Nov 16 2017 8:48 AM | Updated on Nov 16 2017 10:14 AM

Chennai and Doha IndiGo flight suffered bird hit - Sakshi

సాక్షి, చెన్నై : ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దోహాకు వెళ్లేందుకు చెన్నై ఎయిర్ పోర్ట్‌లో టేకాఫ్ అయిన విమానాన్ని కొంత సమయానికే ఓ పక్షి ఢీకొట్టింది. ఏదో సమస్య తలెత్తిందని గమనించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని మళ్లీ చెన్నై విమానాశ్రయానికి తీసుకెళ్లి ల్యాండ్ చేయాల్సి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (2:15 గంటలకు) ఇండిగో విమానం చెన్నైకి చేరినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.

ఆ విమానంలోని 134 మంది ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థంకాక కాసేపు భయాందోళనకు గురయ్యారు. గురువారం వేకువ జామున 4:30 గంటలకు మరో విమానాన్ని ఇండిగో ఎయిర్ లైన్స్ సిద్ధం చేసింది. ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది ఆ విమానంలో దోహాకు బయలుదేరినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే పక్షి ఢీకొనడంతో ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని వేరే విమానంలో ప్రయాణించే ఏర్పాట్లు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement