50 ఏళ్లు బీజేపీయే అధికారంలో ఉండాలి: షా

BJP should win all polls from Panchayat to Parliament for 50 years, says Amit Shah - Sakshi

ఘజియాబాద్‌: భారత్‌ ప్రపంచ శక్తిగా ఎదగాలంటే బీజేపీనే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగాలని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ఇది సాకారం కావాలంటే వచ్చే 50 ఏళ్ల పాటు పంచాయతీ నుంచి పార్లమెంట్‌ దాకా అన్ని ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో పార్టీ అధికారంలోకి వచ్చే దాకా విశ్రమించొద్దని కోరారు. ఆదివారం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్‌ సమావేశం ముగింపు కార్యక్రమంలో షా ప్రసంగించారు. మహిళా సాధికారతకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆయన గుర్తుచేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top