ఈమె ఎవరో గుర్తు ఉన్నారా? | Long Time No See, Sameera Reddy | Sakshi
Sakshi News home page

ఈమె ఎవరో గుర్తు ఉన్నారా?

May 23 2018 8:21 PM | Updated on May 23 2018 8:30 PM

Long Time No See, Sameera Reddy - Sakshi

న్యూఢిల్లీ : నటి సమీరా రెడ్డి గుర్తు ఉన్నారా? టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌తో అశోక్‌, బాలీవుడ్‌లో సైఫ్‌ అలీ ఖాన్‌తో రేస్‌ సినిమాలు తీసిన ఈమె, చాలా కాలానికి మళ్లీ అభిమానులకు కనిపించింది. అయితే సినిమాల్లో కాదండి.. సోషల్‌ మీడియాలో తాను పోస్టు చేసిన ఫోటోలతో. ప్రస్తుతం ఆమె తల్లి బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. ముంబైకి చెందిన బిజినెస్‌మేన్ అక్షయ్ వార్దేను పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె వార్తల్లో కనిపించడం చాలా అరుదుగా మారారు. తాజాగా తన కొడుకు రేపు మూడో ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో, కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను అభిమానుల కోసం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 

‘నీతో ఇది నా మొదటి రోజు. రేపు నీవు మూడో ఏడాదిలోకి ప్రవేశించబోతున్నావు. నా ప్రపంచంలోకి వచ్చిన నీకు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌తో సమీరా ఈ ఫోటోలను పోస్టు చేశారు. ఈ పోస్టులకు నటి సమితా శెట్టి వావ్‌ అని కామెంట్‌ పెట్టారు. అభిమానులు సైతం ఆ క్యూట్‌ ఫోటోలకు వావ్‌ అనకుండా ఉండలేకపోతున్నారు. 2014లో అక్షయ్‌ వార్దేను ఆమె పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమె పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పేశారు. తన జీవితంలో పెద్ద మార్పు వచ్చినట్టు అప్పుడే సమీరా రెడ్డి ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం సమీరా రెడ్డి, సోనాలి బింద్రే బాద్రాలో కలుసుకున్నట్టు తెలిసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement