
అమ్మాయిలను ఆటపట్టించే సన్నివేశం
పద్మనాభం(భీమిలి): మండలంలోని మూడు చోట్ల గురువారం హైటెక్ అమ్మాయిలు, బీటెక్ అబ్బాయిలు సినిమా షూటింగ్ జరిగింది. నూతన నటీనటులతో ఈ సినిమాను తీస్తున్నారు. కురపల్లిలో సర్పంచ్ ఆర్.ఎస్.వజ్రమార్రాజు ఇంట్లో, కృష్ణాపురం క్వారీ, పద్మనాభం జంక్షన్లో ఈ షూటింగ్ తీశారు. పద్మనాభం జంక్షన్లో కళాశాల అమ్మాయిలు బస్సు కోసం నిరీక్షిస్తుండగా..వీరిని కొందరు బీట్ కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరిచారు. వెనుకటి జీవన విధానం, కుటుంబ నేపథ్యంతో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. సినిమాకు టి.విజయమోహన్రెడ్డి నిర్మాతగా, రజనీ కాంత్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.