రెండు జంటలు
బాలీవుడ్లో తెరకెక్కనున్న ఓ మోడ్రన్ లవ్స్టోరీ కోసం రెండు జంటలు కావాలి. అందులో ఒక జోడీగా ‘గల్లీభాయ్’ ఫేమ్ సిద్దాంత్ చతుర్వేది, దీపికా పదుకోన్ కుదిరారు. మరో జంట కోసం వెతుకుతున్నారు దర్శక–నిర్మాతలు. ఈ కొత్త ప్రేమ కథను ‘ఏక్ మోడ్రన్ ఔర్ ఏక్ తు’ (2012), ‘కపూర్ అండ్ సన్స్ (2016) వంటి చిత్రాలను తెరకెక్కించిన షకున్ బాత్రా డైరెక్ట్ చేస్తారు. దర్శక–నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తారు. ‘‘నేటి తరం ప్రేమికుల ఆలోచనలు, అనుబంధాలు, నమ్మకాలు వంటి అంశాలపై ఫోకస్ పెడుతూ రెండు జంటల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది మార్చిలో చిత్రీకరణ మొదలుపెట్టాలనుకుంటున్నాం. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లొకేషన్స్ వెతకడం ప్రారంభించాం. ఈ సినిమా చిత్రీకరణకు ముందు కొన్ని వర్క్షాష్లు ప్లాన్ చేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
సంబంధిత వార్తలు