‘నిశబ్ధం’ మొదలైంది!

Anushka Shetty Nishabdam Starts Rolling - Sakshi

భాగమతి సినిమా తరువాత వెండితెర మీద కనిపించని అనుష్క, కొత్త సినిమాను ప్రారంభించారు. లుక్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ కొత్త సినిమాలో తన కొత్త లుక్‌లో షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెలుగులో ‘నిశబ్ధం’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇతర భాషల్లో ‘సైలెన్స్‌’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బహుభాషా నటుడు మాధవన్‌ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మరో కీలక పాత్రలో హాలీవుడ్ నటుడు  మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ కనిపించనున్నారు. ఈ సినిమాకు ‘వస్తాడు నా రాజు’ ఫేమ్‌ హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top