465... అసలేం జరిగింది? | 465 audio will be released shortley | Sakshi
Sakshi News home page

465... అసలేం జరిగింది?

Jul 18 2017 1:12 AM | Updated on Sep 5 2017 4:15 PM

465... అసలేం జరిగింది?

465... అసలేం జరిగింది?

కార్తీక్‌ రాజా, నిరంజన, మనోబాల ముఖ్య పాత్రల్లో సాయిసత్యం దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘465’.

కార్తీక్‌ రాజా, నిరంజన, మనోబాల ముఖ్య పాత్రల్లో సాయిసత్యం దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘465’. శివపుత్ర క్రియేషన్స్‌ పతాకంపై అడ్డా వెంకట్రావు సమర్పణలో కుసుమ రామ్‌సాగర్‌ ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘హారర్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘465’. ఈ చిత్రం తమిళనాడులో ఘనవిజయం సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ రాబట్టింది.

ఇంతవరకు వచ్చిన హారర్‌ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. శశాంక్‌ రవిచంద్రన్‌ రీ–రికార్డింగ్‌ ఈ చిత్రానికి హైలైట్‌. అనువాద కార్యక్రమాలు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. తమిళంలోలా తెలుగులోనూ మా చిత్రం విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. త్వరలో ఆడియో, సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శశాంక్‌ రవిచంద్రన్, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, కెమెరా: పి.ఆర్‌.సుందర్, నిర్వహణ: యస్‌.కె. రఫీ, ఎ.టి. కృష్ణన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement