
ర్యాలీపై కాల్పులు, మహిళ మృతి
శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో యునైటెడ్ నేషనల్ పార్టీ మద్దతుదారుల ర్యాలీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కొలంబో: శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో ఎన్నికల ర్యాలీపై కాల్పుల ఘటన కలకలం రేపింది. యునైటెడ్ నేషనల్ పార్టీ మద్దతుదారుల ర్యాలీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆగస్టు 17న ఆ దేశంలో పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
శుక్రవారం యూఎన్పీ ఎంపీ, శ్రీలంక ఆర్థికమంత్రి రవి కారుణ్యాంకేకు మద్దతుగా కార్యకర్తలు ఎన్నికల ప్రచారర్యాలీ నిర్వహించారు. బైక్పై వచ్చిన ఇద్దరు సాయుధులు ప్రదర్శనపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే.. మంత్రి కొద్ది సేపటి ముందే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో.. ఆయన ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు అయింది. దీంతో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కొలంబో గెజిట్ ఈ ఘటనను రిపోర్ట్ చేసింది.