వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం | Nobel Medicine Prizes Announced In Stockholm | Sakshi
Sakshi News home page

వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

Oct 7 2019 3:51 PM | Updated on Oct 7 2019 5:05 PM

Nobel Medicine Prizes Announced In Stockholm - Sakshi

స్టాక్‌హోమ్‌ : వెద్యరంగంలో అందించిన విశిష్ట సేవలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలు 2019 సంవత్సరానికి సంబంధించి నోబెల్‌ పురస్కారాలు అందుకోనున్నారు. విలియంకెలిన్‌, పీటర్‌ రాట్‌క్లిఫ్‌, గ్రెగ్‌ సెమెన్జాకు వైద్యరంగంలో నోబెల్‌ బహుమతిని నోబెల్‌ అసెంబ్లీ సోమవారం ప్రకటించింది. హైపోక్సియా పరిశోధనలో విలువైన సమాచారం ఆవిష్కరించినందుకు వీరిని నోబెల్ వరించింది. ఆక్సిజన్‌ను కణాలు ఏ విధంగా గుర్తించి, స్వీకరిస్తాయన్న అంశంపై ఈ ముగ్గురు సాగించిన విశేష పరిశోధనకు ఈ పురస్కారం దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement