బస్సు, ట్రక్కు ఢీ.. 36 మంది మృతి | At least 36 killed in China Road Accident | Sakshi
Sakshi News home page

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం

Sep 29 2019 4:41 PM | Updated on Sep 29 2019 4:45 PM

At least 36 killed in China Road Accident - Sakshi

బీజింగ్‌: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు జియాంగ్సూ ప్రావిన్సులో బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 36 మంది చనిపోయారు. మరో 40మంది తీవ్ర గాయాలపాలైనట్లు ఈజింగ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని, వీరిలో మరో 20మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నారు. బస్సు ఎడమ టైరు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. చాంగ్‌చున్‌-షెంజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డులో ఈ ప్రమాదంతో ఎనిమిది గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ మధ్య కాలంలో అక్కడి ఎక్స్‌ప్రెస్‌ రోడ్లపై భారీగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement