చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం

At least 36 killed in China Road Accident - Sakshi

బీజింగ్‌: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు జియాంగ్సూ ప్రావిన్సులో బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 36 మంది చనిపోయారు. మరో 40మంది తీవ్ర గాయాలపాలైనట్లు ఈజింగ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని, వీరిలో మరో 20మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నారు. బస్సు ఎడమ టైరు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. చాంగ్‌చున్‌-షెంజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డులో ఈ ప్రమాదంతో ఎనిమిది గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ మధ్య కాలంలో అక్కడి ఎక్స్‌ప్రెస్‌ రోడ్లపై భారీగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top