మీరట్: ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ తరుణ్ కే భరద్వాజ్ అనే భారతీయ అణుశాస్త్రవేత్తను టెక్సాస్లోని జైలులో వేసి ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది (2016) నుంచి ఆయనను తన విధులకు కూడా హాజరుకానివ్వకుండా అందులో ఉంచి వేధిస్తున్నారు. ఈ విషయంపై భరద్వాజ్ స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. అక్రమంగా జాతివివక్షతో తనను డిటెన్షన్ సెంటర్లో ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఏ అండ్ ఎం అనే విశ్వవిద్యాలయంలో తాను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని అది సహించలేక జాతి వివక్షతోనే తనను జైలులో పెట్టి విసిగిస్తున్నారని అన్నారు.
‘జాతి వివక్షకు నేనొక బాధితుడిని. ఆ వర్సిటీలో పెద్ద మొత్తంలో చేస్తున్న అవినీతిని నేను ఫిర్యాదు చేశాను. ఆ కేసును వెనక్కు తీసుకోకపోవడంతో నాపై తప్పుడు ఆరోపణలు చేసి విధుల్లో నుంచి తొలగించి ఇలా అరెస్టు చేయించారు. ఒకమ్మాయిని ఇష్టపడటం తప్పేం కాదు.. అయినా, ఆమెను వేధించానంటూ ఆరోపణలు నమోదు చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. భదర్వాజ్ కుటుంబం ప్రస్తుతం భారత్లోని బులంద్ షహర్లో ఉంటోంది.
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ లో పీహెచ్డీ పూర్తి చేసిన భరద్వాజ్ 2007లో అమెరికాకు పరిశోధకుడిగా వెళ్లాడు. అక్కడే అణుపదార్థాల్లో కెమికల్ క్యారక్టరైజేషన్లో ప్రత్యేక పరిశోధనను టెక్సాస్లోని ఏ అండ్ఎం యూనివర్సిటీలో చేశాడు. ఇటీవల ఆయన ప్రొఫైల్ కూడా సదరు వర్సిటీ ప్రొఫైల్ నుంచి తొలగించారు. ఈ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్న సమయంలోనే పలుమార్లు వివిధ ఆరోపణల పేరిట 2015 జనవరి, ఆగస్టు నెలల్లో అతడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ద్వారా తెలుసుకున్న వివరాల ప్రకారం అతడిపై ఓ అమ్మాయిని వేధించినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
అలాగే, అతడు పనిచేసే సమయంలో చేతికి ధరించాలని చెప్పిన జీపీఎస్ యాంకిల్ మోనిటరింగ్ డివైస్ నుంచి అక్రమంగా తీసేసినట్లు అందులో పేర్కొన్నారు. దాంతో 2016 డిసెంబర్ 29 నుంచి బ్రాజోస్లోని డిటెన్షన్ సెంటర్లో ఉంచి విచారిస్తున్నారంట. అయితే, అతడి సోదరుడు ప్రసూన్ భరద్వాజ్ స్పందిస్తూ తన సోదరుడిని జాతి వివక్షకు బలిచేస్తున్నారని చెప్పారు. ఆ యూనివర్సిటీలో చూపిస్తున్న జాతి వివక్షను, అవినీతిని బహిర్గతం చేయడంతోనే అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణ కేసు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించాడు. ఇదిలా ఉండగా, ఈ కేసు విచారణ పూర్తయ్యాక తరుణ్ను అమెరికా నుంచి పంపించి వేస్తారని ఆయన తరుపు న్యాయవాది చెప్పారు.
యూఎస్ జైలులో భారత అణుశాస్త్రవేత్త కష్టాలు
Published Thu, May 18 2017 8:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement